NEET PG 2025 News:NEET PG 2025 పరీక్ష ఆగస్టు 3న – జులై 31 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా వచ్చే నెల 3న నీట్‌–పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్‌ సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. వాస్తవానికి జూన్‌ 15న రెండు షిఫ్టుల్లో జరగాల్సిన ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదే­శిం­చడంతో ఎన్‌బీఈఎంఎస్‌ దీన్ని ఆగస్టు 3కు వాయిదా వేసింది. 



ఇదీ చదవండి :కంప్యూటర్‌ సైన్స్‌పై కోటి ఆశలు.....30న ఇంజనీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు 



దేశవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పీజీ రాయనుండగా తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉందని అంచనా. ఇందుకోసం రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా 10 కేంద్రాలను ఎంపిక చేశారు. విద్యా­ర్థులకు జూలై 31 నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్‌ 3 నాటికి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచ­నున్నారు. గతేడాది కౌన్సెలింగ్‌ ద్వారా మొత్తం 25,791 సీట్లను కేటాయించారు. 



☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TM8NDq

Post a Comment

Previous Post Next Post